జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..
Thu Jun 05, 2025 14:18 Politics
జిల్లాలోని కావలి నియోజకవర్గం అల్లూరులో వైసీపీ (YSRCP) ఫ్లెక్సీల కలకలం రేగింది. ‘జగనన్నా.. మాకు దిక్కెవరన్నా’ అంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కావలి నియోజకవర్గంలో మొత్తానికి మొత్తంగా వైసీపీ ఖాళీ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై (Former MLA Ramireddy Pratap Kumar Reddy) నేతలు, శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రామిరెడ్డిపై ముఖ్య అనుచరులే రివర్స్ అవుతున్న పరిస్థితి. రామిరెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలు అంటూ ఇటీవల ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ బహిర్గతం చేశారు. అంతేకాకుండా మరో నలుగురు ముఖ్య అనుచరులు, పెద్ద సంఖ్యలో శ్రేణులు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వెన్నుపోటు దినోత్సవం రోజే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YSRCP Chief YS Jagan Mohan Reddy) ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: అనంతపురం తెదేపా నేతలకు అధిష్ఠానం పిలుపు.. ఇరువురినీ విచారించే బాధ్యతను..
ఇటీవల కావలి రూరల్ మండలంలో కూడా ప్రజాప్రతినిధులు, మత్స్యకారనేతలు అంతా కూడా సమావేశమయ్యారు. వైసీపీలో పరిస్థితులు బాగోలేవని, కనీసం పట్టించుకునే దిక్కుకూడా లేదని వెంటనే టీడీపీలోకి వెళ్లిపోవాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దగదర్తి మండలంలో ప్రజాప్రతినిధులంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉపాధ్యక్షుడిని ఎన్నుకున్నారు. త్వరలోనే ప్రజాప్రతినిధులంతా కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు కావలి టౌన్లో కూడా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి చెందిన నలుగురు ముఖ్య అనుచరులు అంతా కూడా పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరో వారం పదిరోజుల్లో వీరంతా కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. నెల్లూరులో ఏ ప్రాంతంలో చూసినా నేతలంతా కూడా వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న అతికొద్ది మాత్రం తమ పరిస్థితి ఏంటి అనేది తెలియని సందిగ్ధంలో పడ్డారు. పదిహేనేళ్ల పాటు పార్టీ జెండాలు మోసామని, కనీసం పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓ వైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉండగా.. మరోవైపు కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం ఫోన్లో కూడా స్పందించని పరిస్థితి అంటూ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ను ప్రశ్నిస్తూ అల్లూరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #jagan #AndhraPradesh #Appolitics #YCP #Nellore #AlluruLeaders #QuestionToJagan #ViralNews #PartyGoodBye #JaganShock
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.